Local Jobs: పదవ తరగతి లేదా ఇంటర్ పాస్ అయినా వాళ్లు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందవచ్చు. డిగ్రీ చదివిన వాళ్లు కూడా ఉద్యోగం పొందవచ్చు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వాళ్ల కోసం ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలిపింది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా నెలకు పదివేల నుంచి 18 వేల రూపాయల జీతంతో ఉద్యోగ అవకాశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రైవేట్ కార్పొరేట్ సంయుక్త భాగస్వామ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు వృత్తి నైపుణ్యాల పై ఉచిత శిక్షణ అందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలోనే ప్రతి నియోజకవర్గంలో కూడా నిరుద్యోగ యువత కోసం ఉద్యోగమేల లు నిర్వహించి కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
తాజాగా ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కేంద్రంలోని సి క్యాంప్ లో ఉన్నటువంటి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల ఏప్రిల్ 11వ తేదీన మినీ జాబ్ మేళా ప్రభుత్వ నిర్వహిస్తున్నట్లు పి దీప్తి చెప్పుకొచ్చారు. రెండు ప్రముఖ కంపెనీలు అయినా ముత్తూట్ ఫైనాన్స్ మరియు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తమ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ మినీ జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
ఈ ఉద్యోగాల కోసం పదవ తరగతి నుంచి ఇంటర్ లేదా డిగ్రీ లేదా డిప్లమా ఇలా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు అర్హులు. ఏప్రిల్ 11, 2025 ఉదయం 10 గంటల నుంచి ఈ మినీ జాబ్ మేళా జరగనుంది. కర్నూలు జిల్లాలోని నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పి దీప్తి చెప్పుకొచ్చారు. ఇందులో ఉద్యోగం వచ్చిన వాళ్ళకి అర్హతను బట్టి పదివేల నుంచి 18 వేల వరకు జీతం ఉంటుందని ఫైగా సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది అని తెలిపారు.